Andhra Pradesh: పసిపాప భారమైందా..? ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు..

|

Feb 07, 2023 | 7:11 PM

గు పాశం మరచిపోయి ప్రవర్తించిందని మండిపడుతున్నారు. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Andhra Pradesh: పసిపాప భారమైందా..? ఆస్పత్రి టాయిలెట్‌లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు..
Baby
Follow us on

ఏ తల్లి కర్కాశత్వమో … మరే తల్లి పాపమో గానీ.. అభం శుభం తెలియని చిన్నారి మరుగుదొడ్డిలో కనిపించింది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన మరుక్షణమే మమకారానికి దూరమైంది. నవ మాసాలు మోసాక పేగు తెంచుకు పుట్టినందుకు ఆ తల్లి దూరం చేసి వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది ఈ అమానవీయ ఘటన. నవమాసాలు మోసి కన్నతల్లి అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రి టాయిలెట్లో వదిలివెళ్లిన ఘటన అందరినీ కలచివేస్తోంది. అమ్మ ఒడిలో ఉండాల్సిన పసికందు, తల్లి పాలు తాగుతూ సేద తీరాల్సిన చిన్నారి మరుగుదొడ్డిలో, మురుగు వాసన మధ్య ఉన్న దృశ్యం అక్కడి స్థానికుల్ని కలచివేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది.

అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ఆసుపత్రిలో కనిపించిన ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. గుక్క పెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని చూసి చలించిన ఆసుపత్రి సిబ్బంది అక్కున చేర్చుకొని సపర్యాలు చేశారు. నవజాత శిశు కేంద్రానికి చిన్నారిని తరలించారు. ఆడపిల్లగా పుట్టడమే శాపమా అన్నట్టు మరో అవమానవీయ ఘటనను చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. జన్మనిచ్చిన ఆ మహిళ కర్కశత్వానికి చీత్కరిస్తున్నారు. పేగు పాశం మరచిపోయి ప్రవర్తించిందని మండిపడుతున్నారు. అమ్మ అన్న పదానికే మాయని మచ్చ తెచ్చిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..