భారత్‌ వద్ద మోదీ అనే మిస్సైల్‌ ఉంది! వంద పాకిస్థాన్‌లు వచ్చినా ఏం చేయలేవు: నారా లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, అమరావతి పునఃప్రారంభోత్సవంలో మోడీ ప్రసంగం తర్వాత, భారతదేశం అజేయమని, మోడీని "మిస్సైల్" అని వర్ణించారు. వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్‌కు హాని చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. మోడీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

భారత్‌ వద్ద మోదీ అనే మిస్సైల్‌ ఉంది! వంద పాకిస్థాన్‌లు వచ్చినా ఏం చేయలేవు: నారా లోకేష్‌
Nara Lokesh And Pm Modi

Updated on: May 02, 2025 | 4:39 PM

ఒక్క పాకిస్థాన్‌ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేవని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సభలో లోకేష్‌ మాట్లాడుతూ.. భారత్‌ వద్ద మోదీ అనే మిసైల్‌ ఉందన్నారు. భారత్‌ గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని వ్యాఖ్యానించారు. మోదీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం ఉందని అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి