కిడ్నీ రాకెట్ కేసు: శ్రద్ధ హాస్పిటల్ సీజ్

| Edited By:

May 20, 2019 | 1:35 PM

విశాఖలో సంచనలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యం అవయవాల వ్యాపారం చేసినట్లు త్రిసభ్య కమిటీ ఇప్పటికే తేల్చింది. దీంతో అధికారులు శ్రద్ధ ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు హాస్పిటల్‌ను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిని సీజ్ చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే విశాఖలో శ్రద్ధా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ అవయవాల దందా […]

కిడ్నీ రాకెట్ కేసు: శ్రద్ధ హాస్పిటల్ సీజ్
Follow us on

విశాఖలో సంచనలం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసుల కక్కుర్తితో శ్రద్ధ హాస్పిటల్ యాజమాన్యం అవయవాల వ్యాపారం చేసినట్లు త్రిసభ్య కమిటీ ఇప్పటికే తేల్చింది. దీంతో అధికారులు శ్రద్ధ ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు హాస్పిటల్‌ను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిని సీజ్ చేసే అవకాశముంది.

ఇదిలా ఉంటే విశాఖలో శ్రద్ధా హాస్పిటల్‌తో పాటు మరికొన్ని ఆసుపత్రుల్లోనూ అవయవాల దందా జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు నగరంలో గుట్టుగా అవయవాల వ్యాపారం ఎన్ని ఆసుపత్రుల్లో జరుగుతోందన్న దానిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో నగరంలోని మిగతా హాస్పిటల్స్‌లో అవయవాల మార్పిడిపై విచారణ జరిపి పది రోజుల్లో నివేదిక అందజేయాలని త్రిసభ్య కమిటీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.