Vizag municipal elections : రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగొస్తుందని పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారు : గంటా శ్రీనివాసరావు

Vizag Steel,  Ganta Srinivasa rao :  ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి, విశాఖపట్నం..

Vizag municipal elections : రాజీనామాలు చేస్తేనే కేంద్రం దిగొస్తుందని పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారు : గంటా శ్రీనివాసరావు

Edited By: Ravi Kiran

Updated on: Mar 10, 2021 | 10:53 AM

Vizag Steel plant privatisation :  ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వైఎస్ జగనే చెప్పారని గుర్తు చేశారు మాజీ మంత్రి, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. విశాఖ నగరపాలక ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును రక్షించుకోడానికి అన్ని పార్టీలు, వర్గాలు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని, దీనికి అధికార పార్టీ నాయకత్వం వహించాలని గంటా డిమాండ్‌ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా రాజీనామా చేస్తే కేంద్రం దిగి వస్తుందన్నారు. అందుకు అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Read also : Gold features : ధరలు తగ్గుతున్నాయి.. బంగారం కొనేందుకు ఇది సరైన సమయమేనా? కొన్నాళ్లు ఆగితే బెటరా?