AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగష్టు 1 నుంచి విశాఖ జిల్లాలో తెరుచుకోనున్న పర్యాటక ప్రదేశాలు

కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పర్యాటకం మూత పడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభం అవుతుండగా..

ఆగష్టు 1 నుంచి విశాఖ జిల్లాలో తెరుచుకోనున్న పర్యాటక ప్రదేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2020 | 5:37 PM

Share

కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పర్యాటకం మూత పడిన విషయం తెలిసిందే. దీంతో అన్ని రాష్ట్రాలకు కోట్లలో నష్టం వాటిల్లింది. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభం అవుతుండగా.. పర్యాటక రంగం కూడా ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పాటిస్తూ ఆగష్టు 1 నుంచి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరవనున్నట్లు పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. అన్ని ప్రాంతాల్లో సందర్శకులను అనుమతిస్తామని తెలిపారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను ఆగష్టు 1 నుంచి ప్రారంభిస్తామని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డివిజనల్ మేనేజర్‌ టీజీ ప్రసాద్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను పాటిస్తామని ఆయన అన్నారు. ఈ క్రమంలో బుర్రా గుహలలో ఇదివరకు గంటకు 1000 మంది పర్యాటకులకు అనుమతిని ఇస్తుండగా.. ఇకపై 300 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని అన్నారు. దీనికి సంబంధించి టికెట్లు కొనే సమయంలోనే సందర్శించాల్సిన సమయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాల్లోకి రావాలంటే ఫేస్‌ మాస్క్ తప్పనిసరి అని.. శానిటైజర్స్‌, డిస్పోజల్ గ్లౌజ్‌లు తాము అందిస్తామని వివరించారు. అలాగే పర్యాటకుల ఉష్ణోగ్రతలను చెక్‌ చేయడంతో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్‌లను ప్రోత్సహిస్తామని ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇక బోటింగ్ విధానంలోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.