తెలంగాణలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందిని వివిధ శాఖలకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 15 మందిని వివిధ శాఖలకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన ఐఏఎస్ల వివరాలు:
1.జ్యోతి బుద్ధప్రకాష్- అడిషనల్ సీఈవో 2.సయ్యద్ అలీ ముర్తుజా రజీ- వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి 3.శాంతికుమారి-అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా 4.అదర్ సిన్హా- ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ 5. ఎల్ శర్మన్- నాగర్కర్నూల్ కలెక్టర్ 6. శ్రీదేవసేన- పాఠశాల విద్యా డైరెక్టర్ 7. వాకాటి కరుణ- హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ 8. కేఎస్ శ్రీనివాసరాజు- పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి 9. విజయ్కుమార్- సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి 10. యోగితా రాణా- సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ 11. సిక్తా పట్నాయక్- ఆదిలాబాద్ కలెక్టర్ 12. భారతీ హోలీకేరి- పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్ 13. ఇ. శ్రీధర్- గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి 14. రాణి కుముదిని దేవి- కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి 15. పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్కుమార్కు అప్పగింత. ఇక సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగనున్నారు.