కంటోన్మెంట్‌లో ఆక్రమణలు సహించేది లేదు: మంత్రి తలసాని

|

Jul 04, 2020 | 7:51 PM

నగరంలోని కంటోన్మెంట్ ఏరియాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ద‌ృష్టి సారించిందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ల డెవలప్ మెంట్ దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించినట్లుగా మంత్రి వెల్లడించారు. శనివారం రోజున మంత్రి మల్లారెడ్డితో కలిసి..

కంటోన్మెంట్‌లో ఆక్రమణలు సహించేది లేదు: మంత్రి తలసాని
Follow us on

హైదరాబాద్  నగరంలోని కంటోన్మెంట్ ఏరియాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ద‌ృష్టి సారించిందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ల డెవలప్ మెంట్ దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించినట్లుగా మంత్రి వెల్లడించారు. శనివారం రోజున మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన కంటోన్మెంట్‌ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని వెల్లడించారు.

కంటోన్మెంట్‌కు నెలకు రూ.10 కోట్లు ఇచ్చేలా, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోర్డు, వార్డు సభ్యులు ప్రజల మధ్య ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కంటోన్మెంట్‌లో రెవెన్యూ పెంచుకునే దిశగా అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. కంటోన్మెట్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ ప్రాంత సమస్యలపై తాను ఎంపీగా ఉన్నప్పు డు పార్లమెంటులో పోరాడానని అన్నారు. కంటోన్మెంట్‌లోని ప్రతి వార్డుకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నామని తెలిపారు. నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.