AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: వైజాగ్‌-భీమిలీ బీచ్‌లో వింత కాంతి కలకలం.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో

విశాఖపట్నంలోని భీమిలీ బీచ్‌లో ఆదివారం (ఏప్రిల్ 9) రాత్రి వింత వెలుగులు కనిపించాయి. విశాఖ తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులను కనువిందు చేశాయి. సముద్రం ఒడ్డున తీరానికి చేరుకునే అలలు వెన్నెల కాంతుల్లో నీలం రంగులో మెరిసిపోయాయి. ఎన్నడూ లేనిది సముద్రం అలలు నీలం రంగులో..

Visakhapatnam: వైజాగ్‌-భీమిలీ బీచ్‌లో వింత కాంతి కలకలం.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో
Visakhapatnam Bhimili Beach
Srilakshmi C
|

Updated on: Apr 10, 2023 | 4:46 PM

Share

విశాఖపట్నంలోని భీమిలీ బీచ్‌లో ఆదివారం (ఏప్రిల్ 9) రాత్రి వింత వెలుగులు కనిపించాయి. విశాఖ తీర ప్రాంతం పొడవునా ఈ వెలుగులు సందర్శకులను కనువిందు చేశాయి. సముద్రం ఒడ్డున తీరానికి చేరుకునే అలలు వెన్నెల కాంతుల్లో నీలం రంగులో మెరిసిపోయాయి. ఎన్నడూ లేనిది సముద్రం అలలు నీలం రంగులో మెరిసిపోవం ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మరింది. అలలు తాకిన ప్రదేశం కూడా నీలంగా మారిపోవడం సందర్శకులను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి 8 గంటల తరువాత విశాఖ-భీమిలీ బీచ్‌లో ఈ వింత వెలుగు కనిపించింది. తీర ప్రాంతం పొడవునా అదే తరహా కాంతులు కనిపించాయి. ఈ వింతను తిలకించడానికి విశాఖ నగర వాసులు పెద్ద సంఖ్యలో తీర ప్రాంతానికి చేరుకున్నారు. కొందరు వీడియోలు సైతం తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ సమయంలో సముద్రం మీదుగా వీచే గాలుల్లో కూడా అసాధారణంగా ఉన్నట్లు సందర్శకులు చెబుతున్నారు. కొద్దిసేపు చల్లగా, మళ్లీ క్షణాల్లోనే వేడిగా గాలులు వీచాయని చెప్పుకొచ్చారు. ఇలా ఎప్పుడూ జరగలేదని సందర్శకులు వెల్లడించారు. నిజానికి సముద్ర జలాల్లో చేపలు, నత్తలు, పీతలతోపాటు యాల్జీ, జెల్లిఫిష్ వంటి ఇతర జీవులు కూడా నివసిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో బయోలూమినెస్సీన్స్ అనే సముద్ర జీవుల వల్ల సముద్రం నీలం రంగును సంతరించుకుని ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వాతావరణంలో చోటు చేసుకునే పెను మార్పుల వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. సాధారణంగా ఇలాంటి వింత దృశ్యాలు ప్యూర్టోరికో, శాన్ డియాగో, ఫ్లోరిడా, జపాన్ తీర ప్రాంతాల్లో తరచూ కనిపిస్తుంటాయి. 2019లో ఇదే విధమైన నీలం రంగు కాంతులు చెన్నై తీరంలో ఏర్పడ్డాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అండమాన్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్ సముద్ర తీరాల్లోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడప్పుడు కనువిందు చేస్తుంటాయి. తాజాగా విశాఖపట్నం-భీమిలీ తీరంలో కూడా నీలం కాంతులు కనిపించడంతో నగర వాసులు కొంత ఆశ్చర్యంతోపాటు, భయాందోళనలకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీరు తాగే టీ పొడి అసలైనదేనా?ఈ చిన్న చిట్కాతో నిమిషంలో కనిపెట్టండి
మీరు తాగే టీ పొడి అసలైనదేనా?ఈ చిన్న చిట్కాతో నిమిషంలో కనిపెట్టండి
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ ..
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ ..
కోహ్లీపై కోపంతో టీమిండియా కొంపముంచుతున్న గంభీర్?
కోహ్లీపై కోపంతో టీమిండియా కొంపముంచుతున్న గంభీర్?
కొత్త మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్..150 కిమీల మైలేజ్
కొత్త మెటల్ బాడీ ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్..150 కిమీల మైలేజ్
సంవత్సరాల పాటు నిల్వ ఉండే అమ్మమ్మల నాటి పండు మిరపకాయ పచ్చడి
సంవత్సరాల పాటు నిల్వ ఉండే అమ్మమ్మల నాటి పండు మిరపకాయ పచ్చడి
నాణేల బస్తాతో బైక్ షోరూంకు వచ్చాడు.. ఆ తర్వాత...
నాణేల బస్తాతో బైక్ షోరూంకు వచ్చాడు.. ఆ తర్వాత...
దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్..
దాదా బయోపిక్‌ ‘ఫస్ట్‌ లుక్‌’ అదుర్స్..
శని వక్రగతిలో ఈ కలలు వస్తే అదృష్టం మారుతుందా? స్వప్న శాస్త్రం..
శని వక్రగతిలో ఈ కలలు వస్తే అదృష్టం మారుతుందా? స్వప్న శాస్త్రం..
మీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా
మీ క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారా
పేదవాడి పరమాన్నం.. విటమిన్ బి12 లోపానికి చెక్ పెట్టే లక్ష్మీ చారు
పేదవాడి పరమాన్నం.. విటమిన్ బి12 లోపానికి చెక్ పెట్టే లక్ష్మీ చారు