ఇక చెట్ల నరికివేత ఆపండి.. ‘ సేవ్ ఆరే ‘.. సుప్రీంకోర్టు ఆదేశం

| Edited By: Srinu

Oct 07, 2019 | 4:32 PM

ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. చెట్ల నరికివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తిరిగి ఈ నెల 21 న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కాలనీలో ఇష్టం వఛ్చినట్టు చెట్లను నరికివేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటూ కొందరు లా విద్యార్థులు నేరుగా చీఫ్ జస్టిస్ రంజన్ […]

ఇక చెట్ల నరికివేత ఆపండి..  సేవ్ ఆరే .. సుప్రీంకోర్టు ఆదేశం
Follow us on

ముంబైలోని ఆరే కాలనీలో ఇక చెట్ల నరికివేతను ఆపివేయాలని సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ యధాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, అశోక్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది. చెట్ల నరికివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తిరిగి ఈ నెల 21 న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఈ కాలనీలో ఇష్టం వఛ్చినట్టు చెట్లను నరికివేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటూ కొందరు లా విద్యార్థులు నేరుగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ కే లేఖ రాశారు. ఆ లేఖను ‘ పిల్ ‘ గా పరిగణించిన కోర్టు.. సూమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కాలనీలో ఇక చెట్ల నరికివేత జరగదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ వైఖరికి నిరసనగా ఆందోళన చేసి.. అరెస్టయిన విద్యార్థులు విడుదలవుతున్నారని కూడా ఆయన వెల్లడించారు. కాగా-ఈ విషయంలో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను కూడా ప్రతివాదులుగా చేర్చాలని కోర్టు ఆదేశించింది.

ఆరే కాలనీలో అటవీ ప్రాంతం కూడా ఉందని, అయితే చెట్ల నరికివేత వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ ఎంజీవోలు, కొందరు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు కొట్టివేయడంతో గత శుక్రవారం రాత్రి నుంచి ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ చెట్ల నరికివేతను ప్రారంభించింది. ఈ కాలనీలో ఇప్పటివరకు సుమారు 2,600 చెట్లను అటవీ శాఖ సిబ్బంది కూల్చివేశారు. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మెట్రో రైల్ కార్పొరేషన్ తన ‘ చెట్ల నరికివేత ‘ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. ఆరే ప్రాంతంలో ‘ మెట్రో కార్ షెడ్ ‘ ఏర్పాటుకు అనువుగా ఈ సంస్థ ఈ చర్య చేబట్టింది.