చంద్రబాబు ఇంటికి వరద ప్రమాద హెచ్చరిక
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి
Chandrababu residence Undavvali: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి అధికారులు వరద ప్రమాద హెచ్చరిక పత్రాలను అంటించారు. ఆయన నివాసంతో పాటు కృష్ణా కరకట్టకు లోపలవైపు ఉన్న 36 భవనాలకు అధికారులు వరద హెచ్చరిక పత్రాలను అతికించారు. ఆదివారం ఉదయం 3.97 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, బ్యారేజీ ఎగువ భాగంలో నీటిమట్టం 12 అడుగులకు చేరిందని ఆ పత్రాల్లో పేర్కొన్నారు. జలవనరుల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈ హెచ్చరికను జారీ చేశారు.
Read More:
కరోనా అప్డేట్స్: తెలంగాణలో 1,378 కొత్త కేసులు.. 7 మరణాలు