విజయవాడలో విద్యార్థులు రెచ్చిపోయారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, రాళ్లతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇందులో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పటమటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్ జోక్యం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పలువురు రాజకీయ పార్టీ నేతల అనుచరుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read This Story Also: ఆ ఇద్దరు వద్దేంటేనే విజయ్ వద్దకు వెళ్లిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!