తిరుపతిలో లభ్యం కానీ 236 మంది కరోనా పాజిటివ్‌ బాధితుల ఆచూకీ

| Edited By:

Jul 23, 2020 | 12:30 PM

తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. 

తిరుపతిలో లభ్యం కానీ 236 మంది కరోనా పాజిటివ్‌ బాధితుల ఆచూకీ
Follow us on

తిరుపతి కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా స్వాబ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చాక బాధితులు ఆసుపత్రుల్లో చేరడం లేదు. స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్స్‌ తీసుకునే సమయంలో కొంతమంది రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు అడ్రస్‌ని ఇస్తున్నారు. టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చాక వారికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా రాంగ్ నంబర్ అని వస్తోంది. ఇక చిరునామాకు వెళ్తే అది వారి అడ్రస్ కాదని తెలుస్తోంది. ఇలా గత పదిరోజుల్లో 236మంది కరోనా పాజిటివ్ బాధితుల ఆచూకీ లభించలేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

పాజిటివ్ వచ్చినప్పటికీ వారు జనాల్లోనే తిరుగుతున్నట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిపై అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ భత్‌ నారాయణ గుప్తా మాట్లాడుతూ.. రోజుకి కనీసం 20 పాజిటివ్ కేసుల విషయంలో ఇలాగే జరుగుతోందని అన్నారు. పాజిటివ్ కేసుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని.. టెస్ట్ చేయించుకుని రాంగ్ ఫోన్ నంబర్, తప్పుడు చిరునామా ఇస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇలా పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగడం వలన వారి ఆరోగ్యం పాడవటంతో పాటు జనాలకు కరోనా సోకే ప్రమాదం ఉంటుందని అన్నారు. ఇలాంటివారిని గుర్తించడానికి పోలీసుల సహకారం తీసుకుంటున్నామని, ఇకపై తప్పుడు అడ్రస్ ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే స్వాబ్ టెస్ట్ కోసం శాంపిల్ తీసుకునేప్పుడు ఓటీపీ సిస్టమ్ పెడుతున్నట్టు నారాయణ గుప్తా ప్రకటించారు.