తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. 2 లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059 కు చేరింది
Telangana Corona Bulletin: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 948 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,275 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,896 మంది డిశ్చార్జ్ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,00,68 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 21,098 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో26,027 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్ల సంఖ్య 38,56,530 కు చేరింది.
జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 212, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 56, జగిత్యాల్ 21, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 7, జోగులమ్మ గద్వాల్ 9, కామారెడ్డి 4, కరీంనగర్ 63, ఖమ్మం 25, కొమరం భీమ్ అసిఫాబాద్ 0, మహబూబ్ నగర్ 11, మహబూబాబాద్ 15, మంచిర్యాల్ 9, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్గిరి 65, ములుగు 14, నాగర్ కర్నూల్ 11, నల్గొండ 35, నారాయణ్పేట్ 2, నిర్మల్ 5, నిజామాబాద్ 29, పెద్దంపల్లి 14, రాజన్న సిరిసిల్ల 9, రంగారెడ్డి 98, సంగారెడ్డి 42, సిద్ధిపేట్ 54, సూర్యాపేట 28, వికారాబాద్ 5, వనపర్తి 11, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 46, యాద్రాది భువనగిరి 10 కేసులు నమోదయ్యాయి.
Read More:
మళ్లీ హౌజ్లోకి మోనాల్.. అఖిల్ ఆనందానికి అవధుల్లేవు
Bigg Boss 4: మాస్టర్పై కుమార్ సాయి బిగ్బాంబ్.. ఈ వారం ఆ పని తప్పదు