AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడిన విజయారెడ్డి మర్డర్ మిస్టరీ

విశాఖలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి మర్డర్ మిస్టరీ వీడింది. పక్కా ప్లాన్‌తోనే విజయారెడ్డిని హేమంత్, రాధిక కలిసి హాత్య చేశారని పోలీసులు తేల్చారు. ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్ల రూపంలో వచ్చి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విజయారెడ్డి హత్య కేసులో నిందితులు హేమంత్, రాధికలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ ఒకే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల ఫిబ్రవరి 25న జరిగిన ఈ […]

వీడిన విజయారెడ్డి మర్డర్ మిస్టరీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 8:50 AM

Share

విశాఖలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి మర్డర్ మిస్టరీ వీడింది. పక్కా ప్లాన్‌తోనే విజయారెడ్డిని హేమంత్, రాధిక కలిసి హాత్య చేశారని పోలీసులు తేల్చారు. ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్ల రూపంలో వచ్చి ఆమెను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విజయారెడ్డి హత్య కేసులో నిందితులు హేమంత్, రాధికలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులిద్దరూ ఒకే రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల ఫిబ్రవరి 25న జరిగిన ఈ మర్డర్ తీవ్ర కలకలం రేపింది. డబ్బు కోసమే ఈ హత్య జరిగినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.