Andhra: ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య – పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటనకు కేటాయించిన ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కేంద్ర మంత్రి తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లే ముందు బయటపడ్డ సాంకేతిక సమస్య బయటపడింది. టేకాఫ్ అవ్వడానికి ముందు సమస్య రావడంతో గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్నారు.

Andhra: ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య - పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దు
Piyush Goyal

Updated on: Jun 16, 2025 | 4:45 PM

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత, దానిలో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్‌ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు వినియోగించే హెలికాప్టర్లలో సాంకేతిక, భద్రతా సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై అసలు ఆ హెలికాప్టర్‌ వాడొచ్చా లేదో వివరణ ఇవ్వాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..