Bapatla:ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ.. ఇద్దరు దుర్మరణం..

|

Feb 08, 2023 | 3:00 PM

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బొలెరో గూడ్స్ వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహనంలోని ఇద్దరూ మృతి చెందారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం..

Bapatla:ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ.. ఇద్దరు దుర్మరణం..
Accident
Follow us on

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బొలెరో గూడ్స్ వాహనం ఢీ కొన్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహనంలోని ఇద్దరూ మృతి చెందారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన దుగ్గంపూడి వెంకటేశ్వర్ రెడ్డి, కొలగట్ల వెంకటేశ్వర్ రెడ్డిలు బొలెరో గూడ్స్ వాహనంలో ప్రయాణిస్తున్నారు. వారు బొలెరో వాహనంలో నరసరావుపేట నుంచి స్వగ్రామానికి పయనమయ్యారు. మార్గమధ్యలో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాత మాగులూరు గ్రామం వద్దరు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బోలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ఘటనలో బోలెరో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు గుంతకల్ నుంచి విజయవాడ వెళ్తోంది. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..