AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections: ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఏ అంశాలకు ప్రభావితం అయ్యారు? ఇదిగో గ్రౌండ్ రిపోర్ట్

2020 తర్వాత పలు రాష్ట్రాల్లో సంక్షేమం, అభివృధ్ధి నినాదాల మధ్యే ఎన్నికలు జరిగాయి. అయితే మెజార్టీ రాష్ట్రాల్లో పార్టీలను సంక్షేమం గట్టెక్కించింది. మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా హామీలు ఇచ్చిన పార్టీలు అధికారం చేపట్టాయి. ఏపీకి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలతో పాటు.. బెంగాల్‌ దాకా తీర్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఏపీ ప్రజలు ఎలాంటి అంశాలకు ప్రభావితం అయ్యారు?

AP Elections: ఏపీ ప్రజలు ఎన్నికల్లో ఏ అంశాలకు ప్రభావితం అయ్యారు? ఇదిగో గ్రౌండ్ రిపోర్ట్
Tv9 Poll Analysis
Ram Naramaneni
|

Updated on: May 29, 2024 | 7:07 PM

Share

గడిచిన రెండు, మూడు దశాబ్ధాలుగా దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. ఇందులో ప్రధానంగా సంక్షేమ అజెండా. ఎన్నికల్లో నార్త్‌, సౌత్‌ తేడా లేకుండా ఉచితహామీలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. సంక్షేమంపై భిన్నవాదనలు ఉన్నా.. వాటి ప్రస్తావన లేకుండా పార్టీలు జనం ముందుకు రావడం లేదు. ఓటు పడాలంటే సంక్షేమం ఉండాల్సిందే అంటున్నాయి పార్టీలు. గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ లాంటి జాతీయపార్టీలు కూడా ఇప్పుడు ఉచితపథకాలు, నగదు బదిలీ స్కీములకు జైకొడుతోంది.

2020 తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల్లో కూడా సంక్షేమం, అభివృధ్ధి నినాదాల మధ్యే ఎన్నికలు జరిగాయి. అయితే మెజార్టీ రాష్ట్రాల్లో పార్టీలను సంక్షేమం గట్టెక్కించింది. మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా హామీలు ఇచ్చిన పార్టీలు అధికారం చేపట్టాయి. ఏపీకి సరిహద్దులో ఉన్న రాష్ట్రాలతో పాటు.. బెంగాల్‌ దాకా తీర్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఏపీ ప్రజలు ఎలాంటి అంశాలకు ప్రభావితం అయ్యారు? వారిని ఆకర్షించింది సంక్షేమమా? లేక సంక్షేమంతో కూడిన అభివృద్ధి అంటున్న కూటమి అజెండానా? ఇదే అంశంపై లోతుగా అనాలసిస్‌ చేపట్టాం. ఆ డీటేల్స్ మీ కోసం….

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..