Tirumala: శ్రీవారి ఆలయ అర్చకులతో ఈవో భేటీ.. మార్పుపై చర్చించిన అంశాలివే..

| Edited By: Srikar T

Jul 02, 2024 | 1:16 PM

తిరుమల శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలతోపాటు పలు అంశాలపై టిటిడి ఈవో దృష్టి పెట్టారు. తిరుమల ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో సమీక్షించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు. టిటిడి జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు.

Tirumala: శ్రీవారి ఆలయ అర్చకులతో ఈవో భేటీ.. మార్పుపై చర్చించిన అంశాలివే..
Ttd Eo
Follow us on

తిరుమల శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలతోపాటు పలు అంశాలపై టిటిడి ఈవో దృష్టి పెట్టారు. తిరుమల ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో సమీక్షించారు. టీటీడీ ఈవో జె.శ్యామలరావు. టిటిడి జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈవోకు వివరించారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అపరెంటీస్‎గా అవకాశం కల్పించాలన్నారు.

భవిష్యత్తును నిర్మించుకునేలా వేద విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని అర్చకులు ఈవోకు సూచించారు. గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం ఏడాదిలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈవోను కోరారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో కోవిడ్‌ సమయంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దీన్ని పెంచాలని ఆలయ అర్చకులు శ్రీనివాస దీక్షితులు ఈవో దృష్టికి తీసుకొచ్చారు. ఆలయ ప్రతిష్టటకు భంగం కలుగకుండా పురాతన సంప్రదాయాలు పరిరక్షించడం, ఆచారాలకు విఘాతం కలుగకుండా చూడటం తమ బాధ్యతని ఆగమ సలహాదారులు ఈవోవకు తెలిపారు. మోహనరంగాచార్యులు, సీతారామాచార్యులు, రామకృష్ణ దీక్షితులతోపాటు ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పోటు పీష్కార్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..