AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupathi: శ్రీవారి భక్తులకు శుభవార్త..! నేటి నుంచే అందుబాటులోకి మెట్ల మార్గం

శ్రీవారి భక్తులకు శుభవార్త..! అవును.. గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ తెరుస్తోంది. భారీ వరదల కారణంగా.. శ్రీవారి మెట్టు మార్గాన్ని ఐదు నెలల నుంచి టీటీడీ మూసివేసింది. మరమ్మతులు పూర్తవడంతో ప్రారంభానికి సిద్ధమైంది.

Tirupathi: శ్రీవారి భక్తులకు శుభవార్త..! నేటి నుంచే అందుబాటులోకి మెట్ల మార్గం
Srivari Mettu
Ram Naramaneni
|

Updated on: May 05, 2022 | 10:58 AM

Share

Tirumala Tirupati Devasthanams: శ్రీవారి భక్తులకు తీపికబురు. శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభానికి అంతా రెడీ అయ్యింది. సీఎం జగన్‌ నేడు లాంఛనంగా మెట్ల మార్గాన్ని ప్రారంభించనున్నారు. నేటి నుంచే భక్తుల్ని ఈ మార్గం గుండా అనుమతించనున్నారు. గతేడాది చివరిలో భారీ వర్షాలు, వరదలతో మెట్టు మార్గం ధ్వంసమయ్యింది. టీటీడీ అప్పటి నుంచి భక్తుల్ని ఆ మార్గంలో అనుమతించడం లేదు. అప్పటి నుంచి అక్కడ మరమ్మతులు చేపట్టారు. తిరుమల కొండపైకి రెండు కాలినడక మార్గాలు ఉన్నాయి.. వాటిలో ఒకటి అలిపిరి.. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. రెండో కాలిబాట శ్రీవారి మెట్టు.. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది. తిరుమలకు వెళ్లడానికి ఇది దగ్గరి దారి.

తిరుమలకు కళ్యాణీ డ్యాం నుంచి నీటి సరఫరాకు పైప్‌లైన్‌ వేసిన తర్వాత.. ఈ మార్గం కొంత అభివృద్ధి చెందింది. అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు లోపే ఉంటుంది. కాకపోతే శ్రీవారి మెట్టుకు చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు. ఏపీఎస్‌ ఆర్టీసీ ఇక్కడికి తిరుపతి నుంచి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురంల మీదుగా ఒక బస్సు నడుపుతోంది. టీటీడీ ఉచిత బస్సు సేవ కూడా రైల్వే స్టేషను, బస్ స్టాండ్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకూ అందుబాటులో ఉంది. అలాగే శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుంచి ఆటోలో వెళ్లొచ్చు.

అఖిలాండ కోటీశ్వరుడు శ్రీవారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి భక్తజనం తిరుమలకు పోటెత్తుతుంది. తాజాగా మెట్ల మార్గం అందుబాటులోకి వస్తుండడంతో భక్తజనం ఇబ్బందులు దూరం కానున్నాయి. 3.60 కోట్ల రూపాయలతో రాత్రింబవళ్లు కష్టపడి పనులు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  సాక్షాత్తు శ్రీవారు నడిచిన మార్గం కాబట్టే శ్రీవారిమెట్టుకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు ఈ మార్గంలో అనుమతి ఇస్తామన్నారు. శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు నిత్యప్రసాదాలు అందజేస్తామని చైర్మన్ తెలిపారు.

Also Read: AP: పోలీసులని చూడగానే కారు వదిలేసి ఎస్కేప్.. అసలు ఏంది కథ అని వాహనం చెక్ చేయగా..