Tirumala: తిరుమలపై దారుణ ఘటన.. శ్రీవారి ఆలయం వెనుక హత్య.. అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్

మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సీసీటివి ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Tirumala: తిరుమలపై దారుణ ఘటన..  శ్రీవారి ఆలయం వెనుక హత్య.. అలిపిరి వద్ద నిందితుడు అరెస్ట్
Tirumala Tirupati
Follow us

|

Updated on: Jul 21, 2022 | 1:46 PM

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో( TirumalaTirupati) దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరుమల కొండపై ఓ భక్తుడి హత్య కలకలంరేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం(Govinda Nilayam) దగ్గర వ్యక్తి  మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం  ఓ వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో హత్య జరిగినట్లు గుర్తించారు. సీనియర్ సిటిజన్స్ క్యూలైన్‌లో నిద్రిస్తున్న అనధికార హకర్ పై బండరాయి మోది హత్య చేశారు దుండగులు. ఈ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సీసీటివి ఫుటేజ్ ఆధారంగా 2 గంటల వ్యవధిలో వన్ టౌన్ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అలిపిరి వద్ద నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడు తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. ఈ హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. హత్యకు పాల్పడిన కందస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హకర్‌ను హత్య చేసిన చోరీలకు పాల్పడే వ్యక్తిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..