AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం.. సంస్కృతిలో దాగున్న నిస్వార్థ ప్రేమ..

రైతులు వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగా కాకుండా సంస్కృతి - ఆచారంగా భావిస్తారు. ప్రకృతిని, పక్షులను, జంతువులను ప్రేమించటం వారి అనాదిగా వస్తున్న విద్య. తొలి వరి పంటలో కొంత భాగాన్ని పక్షులకు ఆహారంగా అందించే ధాన్యం పనల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ఇంటికి శుభాన్ని, భూమాతకు గౌరవాన్ని సూచిస్తుంది, మన సంప్రదాయాలను పట్టణ వాసులకు తెలియజేస్తుంది.

Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం.. సంస్కృతిలో దాగున్న నిస్వార్థ ప్రేమ..
The Tradition Of Rice Sheaves
B Ravi Kumar
| Edited By: Krishna S|

Updated on: Dec 12, 2025 | 10:12 AM

Share

భారతదేశానికి రైతులు వెన్నుముక లాంటివారు. వీరికి వ్యవసాయం కేవలం ధనార్జన, కుటుంబ పోషణమాత్రమే కాదు. సంస్కృతి – ఆచారంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి రైతు ప్రకృతిని దైవంగా భావిస్తారు. తాను పండించిన తొలి పంటలో కొంత భాగం దేవుడికి గ్రామదేవతకు మొక్కుగా చెల్లించటంతో పాటు తనతో పాటు కలిసి జీవిస్తున్న పక్షులకు కొంత ఆహారంగా తన పంటను అందచేస్తాడు. జంతువులను, పక్షులను ప్రేమించటం, వాటిని సాకటం ప్రతి రైతుకు అనాదిగా వస్తున్న విద్య. వ్యవసాయం చేసే రైతులు ధాన్యం ఇంటికి రాగానే ధాన్యం పనలతో జడలు అల్లుతారు. వాటిని క్రమపద్ధతిలో కుచ్చులా చేసి దాని గుమ్మం ముందు కడతారు అదేవిధంగా దేవాలయాల్లోనూ ఉంచుతారు. ఈ ధాన్యం కుచ్చులో వుండే గింజలను పక్షులు ఆహారంగా తీసుకుంటాయి.

ధాన్యం రాశులు ఉన్న ఇంటిని దరిద్రం తాకాదని పెద్దలు చెబుతారు. ఇక నేటి యాంత్రిక యుగంలోనూ రైతులు ఈ పద్దతిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పిచుకలు అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. అవి చుట్టూ తిరుగుతూ కిచ కిచ మంటూ సవ్వడి చేస్తుంటే ఏంతో సందడిగా ఉంటుంది. అలాంటి పక్షులకు నేడు కూడు, గూడు కరువైంది. పట్టణీకరణ నేపథ్యంలో పక్షుల ఆవాసాలకు ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి తరుణలో పక్షుల ప్రేమికులు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు కూడా తమ వంతుగా పక్షులు బ్రతకడానికి ఇప్పటికి కృషి చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల రైతులు తమ మొదటి వరి పంట కంకులు పక్షులకు ఆహారంగా పెద్ద మండువా లోగిళ్లు, దేవాయాల వద్ద, సత్రాల వద్ద వేలాడదీయడం ఆనవాయితీ వుండేది.

ఆహారం అందించడానికి వరి కంకుల కుచ్చులు తయారీలో రైతులు తమ కళాత్మకతను ప్రదర్శిస్తున్నారు. ఇవి ఏంటో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తణుకు రూరల్ మండలం వేల్పూరు గ్రామంలో రైతులు వినాయకుని గుడి వద్ద సార్వా పంటకు సంబంధించిన వరి పనలను సేకరించి వాటిని శుభ్రం చేసి జడలుగా అల్లుతున్నారు. జడలను కుచ్చులుగా తయారు చేసి వాటిని దేవాలయాల వద్ద పిచ్చుకలు వచ్చి తినేలా వేలాడదీస్తున్నారు. ఇంటి ముందు ఆలయాల్లో కనిపించే ఈ వారికుచ్చులు రైతు చెమటకు చిహ్నం మాత్రమే కాదు మన సంస్కృతిలో ఒక భాగం. ఇంటికి శుభం చేకూర్చే కార్యక్రమం, మరోవైపు భూమాతకు కర్షకుడు ఇచ్చే గౌరవమని రైతులు చెబుతున్నారు. వీటిని చూస్తుంటే వ్యవసాయం అంటే ఏంటో తెలియని కాన్వెంట్ ప్రోడక్ట్స్ , పట్టణ వాసులకు మన మూలాలు సాంప్రదాయాలు అవగతమవుతాయని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం..
Andhra Pradesh: రైతు అంటే ఇదీ.. పక్షుల కోసం పండించిన ధాన్యం..
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
సింగర్ అవ్వాలనుకుంది.. కట్ చేస్తే ఒక్క సిరీస్‌తో..
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
రూ. 25 కోట్లతో లిస్టు చూస్తే కాటేరమ్మ గుర్తు రావాల్సిందే
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
శివరాజ్ పాటిల్ కన్నుమూత.. 7 సార్లు ఎంపీగా.. కేంద్ర హోంమంత్రిగా..
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
గోల్డెన్ ప్లే బటన్ ఉన్న యూట్యూబర్ 1 సంవత్సరంలో ఎంత సంపాదిస్తాడు?
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
విజయ్ మాస్టర్ ప్లాన్.. ఒక్కొక్కరిని లాగుతూ ప్రత్యర్థులకు షాక్..
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
'ఆ ఒకే ఒక్క తప్పుతో టీమిండియా కొంప ముంచిన గంభీర్‌'
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు
సూది నుండి పుట్టిన బుల్లెట్ ప్రేమ.. నేడు మార్కెట్లో రారాజు