తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్‌.. 36 ఎర్ర ‌చంద‌నం దుంగ‌ల స్వాధీనం, వాహ‌నం సీజ్‌

|

Dec 25, 2020 | 8:08 AM

తిరుమ‌ల అడ‌వుల్లో ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు సంచ‌రిస్తున్నారు. గ‌త కొన్ని రోజుల కింద‌ట సైలెంట్ గా ఉన్న స్మ‌గ్ల‌ర్లు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌కు ....

తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసుల కూంబింగ్‌.. 36 ఎర్ర ‌చంద‌నం దుంగ‌ల స్వాధీనం, వాహ‌నం సీజ్‌
Follow us on

తిరుమ‌ల అడ‌వుల్లో ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు సంచ‌రిస్తున్నారు. గ‌త కొన్ని రోజుల కింద‌ట సైలెంట్ గా ఉన్న స్మ‌గ్ల‌ర్లు మ‌ళ్లీ రెచ్చిపోతున్నారు. రోజురోజుకు ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా తిరుమ‌ల అడ‌వుల్లో శుక్ర‌వారం ఉద‌యం టాస్క్ ఫోర్స్ అధికారులు కూంబింగ్ నిర్వ‌హించారు. క‌ల్యాణి డ్యామ్ వ‌ద్ద ర‌వాణాకు సిబ్బంది ఉన్న 36 ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

దీంతో టాస్క్ ఫోర్స్ అధికారుల‌ను చూసిన దాదాపు 40 మంది ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు ప‌రార‌య్యారు. ఈ కూంబింగ్‌లో ఒక‌రిని అరెస్టు చేయ‌గా, వాహ‌నాన్ని సీజ్ చేశారు. స్మ‌గ్ల‌ర్లు త‌మిళ‌నాడు తిరువ‌న్నామ‌లై జిల్లా చెంగం తాలుకా పాంబ‌త్తూరుకు చెందిన కుమారు (25)గా గుర్తించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇత‌ర స్మ‌గ్ల‌ర్ల కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.