Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం కార్యక్రమం ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 20, 2020 | 9:53 PM

Subramanya Swamy Homam : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం కార్యక్రమం ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

దీనిలో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.

ఈ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, హోమం, లఘుపూర్ణాహుతి, విశేష దీపారాధన చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి స్కంద ష‌ష్ఠ ‌సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం ఏకాంతంగా నిర్వహించారు.