Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుఫాన్ పై కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా గంటకు 13 కి.మీ వేగంతో మిచౌంగ్ తుఫాను కదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు చెప్పారు.

Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
Cyclone Michaung
Follow us
Srikar T

|

Updated on: Dec 04, 2023 | 6:57 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తుఫాన్ పై కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా గంటకు 13 కి.మీ వేగంతో మిచౌంగ్ తుఫాను కదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి 380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్లు చెప్పారు. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి రేపు మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా మారి తీరం దాటనున్నట్లు అంచనా వేశారు.

దీని ప్రభావంతో ఈరోజు, రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసి, ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 80 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సాయంత్రానికి ఈదుర గాలుల తీవ్రత గంటకు 90-110 కి.మీ వేగం ఉంటుందని చెబుతున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ఈ తుఫాన్ రైతులను కలవరపెడుతోంది. పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు. సహాయక చర్యలపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాని దిశానిర్ధేశం చేశారు. తుఫాన్ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాన్ ప్రభావంపై ప్రధాని మోదీ సీఎం జగన్ తో మాట్లాడారు. నష్టంపై అంచనావేయాలని రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..