AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి.. 141 మంది ఆచూకీ గల్లంతు

దేశ వ్యాప్తంగా దిగ్ర్భంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి (60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం వాసి మృతి.. 141 మంది ఆచూకీ గల్లంతు
Odisha Train Accident
Srilakshmi C
|

Updated on: Jun 04, 2023 | 11:59 AM

Share

శ్రీకాకుళం: దేశ వ్యాప్తంగా దిగ్ర్భంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి (60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్‌ రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, ప్రధాని మోదీ మరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుమూర్తి మృతి చెందారు. ఏపీకి చెందిన మరో 11 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 9 మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. మరో ఇద్దరిని భువనేశ్వర్‌లోని అపోలోకు తరలించారు. గుర్తు తెలియని మరో 30 మంది ఫొటోలు అధికారులకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

కాగా ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రెండింటిలోనూ ఏపీకి చెందిన 571 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 141 మంది ప్రయాణికుల వివరాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. గల్లంతైన ప్రయాణికుల జాడ కోసం విశాఖపట్నం కలెక్టరేట్‌లో 9154405292 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 300లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు
ఇంధనం సరిపోక 40,000 అడుగుల ఎత్తులో ఆగిన విమానం ఇంజిన్లు