Dwaraka Tirumala: శ్రీవారి సన్నిధిలో మహిళా యాచకులపై అమానుష దాడి.. స్పందించిన భద్రతా విభాగం

|

Nov 26, 2021 | 5:34 PM

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు.

Dwaraka Tirumala: శ్రీవారి సన్నిధిలో మహిళా యాచకులపై అమానుష దాడి.. స్పందించిన భద్రతా విభాగం
Attack On Beggars
Follow us on

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు. దెబ్బలు తాళ్లలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారనే కారణంతో మహిళా యాచకులను భద్రతా సిబ్బంది మోకాళ్లపై నిలబెట్టి, కర్రలతో చితకబాదారు. ద్వారకా తిరుమలలోని శివాలయం దగ్గర యాచకులపై ఈ దాడి జరిగింది. భక్తులు ఆలయానికి వస్తుంటే..వారికి ఇబ్బంది కలిగించేరీతిలో భిక్షాటన చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడున్న యాచకులందరినీ కర్రతో బాదుతూ ఓ దగ్గరకు తీసుకొచ్చారు సెక్యూరిటీ సిబ్బంది. మహిళలని చూడకుండా మోకాళ్లపై కూర్చొబెట్టారు. భుజాలు, వీపు, కాళ్లపై కర్రలతో గొడ్డును బాదినట్లు బాదేశారు.

మరోవైపు తాము వెళ్లిపోతామని చెప్పినా కనికరం చూపకుండా సెక్యూరిటీ సిబ్బంది కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరును తప్పుబట్టారు. ఈ ఘటనపై టీవీ9 బృందం ఆరా తీసింది. అయితే భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతోనే వాళ్లను మందలించామని దేవస్థానం భద్రతా విభాగం అధికారి సూర్యనారాయణ చెప్పారు. మోకాళ్లపై యాచకులను నిలబెట్టినందుకు తాము భద్రతా సిబ్బందిని మందలించామన్నారు. భక్తులు వస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ అడ్డుపడుతున్నారని..వారికి గతంలోనే కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. అంతేకాదు స్వీపర్లుగా ఉద్యోగం ఇస్తామని చెప్పినా వారు నిరాకరించారన్నారు. గతంలో కొందరి భక్తుల పర్సులు కూడా కొట్టేశారని చెప్పారు. అందుకే వారిని కంట్రోల్‌ చేయడానికి మందలించామని చెప్పుకొచ్చారాయన.

Also Read: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్