AndraPradesh : పార్క్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ ప్రదేశం ఏంటంటే?

| Edited By: Velpula Bharath Rao

Oct 02, 2024 | 1:35 PM

మనిషి జీవితంలో ఆఖరి మజిలి అంతిమ యాత్ర.. చనిపోయిన తరువాత అన్ని మతాల్లోనూ వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు. పూర్వం చనిపోయిన వ్యక్తి మళ్లి బ్రతుకుతాడనే నమ్మకం కూడా ఉండేది.

AndraPradesh : పార్క్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఈ ప్రదేశం ఏంటంటే?
Funeral Park
Follow us on

మనిషి జీవితంలో ఆఖరి మజిలి అంతిమ యాత్ర.. చనిపోయిన తరువాత అన్ని మతాల్లోనూ వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు చేస్తారు. పూర్వం చనిపోయిన వ్యక్తి మళ్లీ బ్రతుకుతాడనే నమ్మకం కూడా ఉండేది. ఇప్పటికి అంతిమ యాత్ర సమయంలో మూడుసార్లు పాడెను కిందకు దించి కొడుకో, లేక ఖర్మ చేసే కూతురితోనో చనిపొయిన వ్యక్తి చెవిలో మృతుడిని పేరుతో పిలుస్తారు.

ఇక స్మశానానికి వెళ్ళిన తరువాత పాడే పై మృతుడిని ఉంచి  కట్టెలు పేర్చి, ఆవు నెయ్యి పోసి, గంధం చెక్కలు వేసి , నీటికుండతో కర్మ చేసే వ్యక్తి మూడు సార్లు ప్రదిక్షిణ చేస్తారు. తలకొరివి పెట్టిన తరువాత కపాలమోక్షం వరకు బంధు మిత్రులు అక్కడే ఉంటారు. ఇంతటి ప్రాధన్యత ఉన్న స్మశానాలు ఇపుడు నిర్లక్ష్యంతో చెత్తదిబ్బలుగా మారాయి.

అక్కడ మూడు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితులు దాపురించాయి. కానీ ఏపీలోని ఉమ్మడి పశ్చిమలోని ఓ ఐదు గ్రామాలు మాత్రం అలా ముక్కుమూసుకుని ఉందామని అనుకోలేదు. ఎవరో వస్తారు ఎదో చేస్తారని ఎదురు చూడకుండా గ్రామస్థులు అందరు ఏకమై ఆఖరి మజిలీ సమస్యను అధిగమించారు.

ముక్కు మూసుకుని అంత్యక్రియలు జరపవలసిన పరిస్థితి నుంచి ఆహ్లాద వాతావరణంలో తమ గ్రామాల ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అవరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. యలమంచిలి మండలంలోని లక్ష్మీపాలెం వడ్డీ లంక, మాట్లపాలెం, గంగడ పాలెం, నార్నిమెరక, నక్కపాలెం గ్రామస్థులు స్వచ్ఛందంగా చందాలు పోగు చేసి దక్షిణ కాశీగా పేరొందిన లక్ష్మీపాలెం వశిష్ఠ గోదావరి నదీ తీరాన ప్రకృతి సోయగల మధ్య ఒక పార్క్‌లా కైలాస వనాన్ని నిర్మించుకున్నారు. ఇక తమ గ్రామాలలో ఎవరైనా మృతి చెందితే తాము ఇబ్బంది పడవలసిన అవసరం లేదని పరిశుభ్ర వాతావరణంలో తమ ఆత్మీయుల అంత్యక్రియలు దగ్గర ఉండి జరిపిస్తామని చెప్పారు.