Ramana Deekshithulu: పూజ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.. సీఎం జగన్‌ను ట్యాగ్‌ చేస్తూ రమణ దీక్షితుల ట్వీట్‌

Ramana Deekshithulu:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన తర్వాత తిరుచానూరు..

Ramana Deekshithulu: పూజ చేయనీయకుండా అడ్డుకుంటున్నారు.. సీఎం జగన్‌ను ట్యాగ్‌ చేస్తూ రమణ దీక్షితుల ట్వీట్‌
Follow us

|

Updated on: Oct 10, 2021 | 12:28 PM

Ramana Deekshithulu:ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ట్యాగ్‌ చేస్తూ రమణ దీక్షితులు ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌లో తిరిగి విధుల్లో చేరిన తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయంలోని వంశపారపర్య అర్చకులకు ఇప్పటి వరకు సంభావన ఇవ్వలేదని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వల్ల 2018 నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నామని, మమ్మల్ని గర్భగుడిలోకి వచ్చి పూజ చేయనీకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ సమస్యల నుంచి అర్చకులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌ను ట్విటర్‌లో కోరారు.

కాగా, ప్రధాన అర్చకుడి హోదాలో తిరిగి విధుల్లో చేరారు. మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 65ఏ ళ్లు దాటిన అర్చకులకు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ రిటైర్ అయ్యారు. వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి త‌ప్పుకున్నారు.

ఇవీ కూడా చదవండి:

Brahmotsavam: ముత్యాల పందిరిలో ఊరేగిన మలయప్ప స్వామి.. భక్తులకు సకల సౌభాగ్య సిద్ధినిస్తుందని నమ్మకం

Snapana Tirumanjanam: భక్తులకు కనువిందు చేసిన శ్రీవారి స్నప‌న తిరుమంజ‌నం వేడుక‌.. తామరపువ్వులు మండపం

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..