AP News: ఖాకీ వనంలో గంజాయి మొక్క… ఏసిబికి చెక్కిన అవినీతి తిమింగలం

| Edited By: Narender Vaitla

Apr 02, 2024 | 7:32 PM

గత నెల మార్చి 29వ తేదిన మేదరమెట్లకు శ్రీనివాసరావును పిలిపించిన ఎస్‌ఐ, అక్కడ కారులో కూర్చుని 30 వేలు లంచం తీసుకున్నాడు... ఆ తరువాత మిగిలిన 70 వేల రూపాయల కోసం శ్రీనివాసరావును పలుమార్లు హెచ్చరించాడు. బేలో వ్యాపారం చేసుకుంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు తల్లి గ్రామంలో సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామంలో ఓ పొగాకు బ్యార్నీ అనుమతులు...

AP News: ఖాకీ వనంలో గంజాయి మొక్క... ఏసిబికి చెక్కిన అవినీతి తిమింగలం
Acb
Follow us on

ప్రకాశంజిల్లా టంగుటూరు ఎస్‌ఐ అందె నాగేశ్వరరావు ఓ సివిల్‌ కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డాడు… టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంకు చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు వలపన్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు… ఓ సివిల్‌కేసు విషయంలో శ్రీనివాసరావును పలిపించిన ఎస్‌ఐ నాగేశ్వరరావు కేసులో ఇబ్బందులు లేకుండా చేయాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

గత నెల మార్చి 29వ తేదిన మేదరమెట్లకు శ్రీనివాసరావును పిలిపించిన ఎస్‌ఐ, అక్కడ కారులో కూర్చుని 30 వేలు లంచం తీసుకున్నాడు… ఆ తరువాత మిగిలిన 70 వేల రూపాయల కోసం శ్రీనివాసరావును పలుమార్లు హెచ్చరించాడు. బేలో వ్యాపారం చేసుకుంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు తల్లి గ్రామంలో సర్పంచ్‌గా ఉన్నారు. గ్రామంలో ఓ పొగాకు బ్యార్నీ అనుమతులు లేకుండా కడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదును విచారించే క్రమంలో ఎస్‌ఐ నాగేశ్వరరావు గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు పెట్టకుండా ఉండేందుకు, ఒకవేళ కేసు పెడితే అరెస్ట్‌ చేయకుడా 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు.

అయితే ఇప్పటికే 30 వేలు లంచం ఇచ్చిన శ్రీనివాసరావు ఇంకా 70 వేలు లంచం ఇచ్చేందుకు ఇష్టంలేక ఏసిబి అధికారులను ఆశ్రయించడంతో ఎస్‌ఐ లంచావతారం వెలుగులోకి వచ్చింది. టంగుటూరు ఎస్ఐ నాగేశ్వరరావు డిమాండ్‌ చేసిన విధంగా ఇప్పటికే ఇచ్చిన 30 వేలు కాకుండా మరో 70 వేలు లంచం ఇచ్చేందుకు ఇష్టంలేని కాకుటూరివారిపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు ఒంగోలులోని ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు… ఫిర్యాదు తీసుకున్న ఏసిబి డిఎస్‌పి వి. శ్రీనివాసరావు తన సిబ్బందితో రంగంలోకి దిగారు.

కొమ్మినేని శ్రీనివాసరావు దగ్గర 70 వేలు లంచం తీసుకునేందుకు టంగుటూరులోని చెల్లెమ్మతోటకు రమ్మని ఎస్‌ఐ నాగేశ్వరరావు కోరారు… అక్కడ కారులో కూర్చుని 70 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అదికారులు దాడి చేసి పట్టుకున్నారు… ఎస్‌ఐ దగ్గర ఉన్న 70 వేలను స్వాధీనం చేసుకున్నారు… అనంతరం టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌లోని కేసుకు సంబంధించిన రికార్డులను స్వాదీనం చేసుకుని ఎస్‌ఐ నాగేశ్వరరావును అరెస్ట్‌ చేశారు… ఎస్‌ఐని రేపు నెల్లూరు ఏసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఒంగోలు ఏసిబి డిఎస్‌పి వి. శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..