Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..

RTC Bus Accident: ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై

PM Narendra Modi: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 15, 2021 | 8:33 PM

RTC Bus Accident: ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు వాగులో పడి పది మంది దుర్మరణం చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమంటూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్‌ చేసింది.

‘‘ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరంగా ఉంది. ఈ దుఃఖ సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొకరికి రూ.2 లక్షల చొప్పున ఎక్సగ్రేషియాను అందిస్తాం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు PMNRF నిధుల నుంచి ఈ మొత్తాన్ని అందచేయనున్నారు’’ అని ప్రధాని కార్యాలయం ట్విట్‌లో తెలిపింది.

ప్రధాని మోదీతోపాటు.. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. బస్సు ఘటనపై విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి కార్యాలయం ట్విట్ చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన అత్యంత విచారకరం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. అంటూ ట్విట్ చేశారు.

వారితోపాటు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ బస్సు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు దుర్ఘటన విషాదకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వారు వెల్లడించారు.

Also Read:

YS Jagan: పదికి చేరిన జల్లేరు మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

RTC Bus Accident: తృటిలో తప్పిన మరో పెను ప్రమాదం.. కాల్వలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..