MPTC Missing: ప్రకాశం జిల్లాలో కనిపించకుండాపోయిన కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ.?

ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం, యనమదల ప్రాదేశికం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన..

MPTC Missing: ప్రకాశం జిల్లాలో కనిపించకుండాపోయిన కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీ.?
Mptc
Follow us

|

Updated on: Sep 22, 2021 | 1:49 PM

MPTC Missing – Prakasam District: ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం, యనమదల ప్రాదేశికం నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా వైకాపా తరఫున విజయం సాధించిన, అయిమాల శ్యాంసన్‌ కనిపించడం లేదని ఆయన భార్య పరమగీతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. 19న ఓట్ల లెక్కింపు అనంతరం విజేతగా అధికారుల నుంచి శ్యాంసన్ ధ్రువపత్రం అందుకున్నారు.

ఆ తర్వాత శ్యాంసన్ సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. ఈ విషయమై కేసు నమోదు చేశామని.. సీఐ సుబ్బారావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జీవీ చౌదరి తెలిపారు. శ్యాంసన్‌ అదృశ్యానికి వైకాపాలోని వర్గపోరే కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాగా, ఈ మండలంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అభ్యర్థి మృతి కారణంగా పోలూరులో ఎన్నికలు నిలిచాయి. మిగతా ఏడింటిలో ఒకటి తెదేపా.. ఆరు వైకాపా సొంతం చేసుకున్నాయి. ఎంపీపీ పదవికి అధికార పార్టీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆధిక్యం కోసం ఓ వర్గం వారు ఆయనను అపహరించారన్న ప్రచారం సాగుతోంది.

Read also: Village President: గ్రామ సమస్యలపై ప్రశ్నించిన గ్రామస్తుడ్ని నడిరోడ్డులో బూటుకాలితో తన్నిన సర్పంచ్.!