Andhra Pradesh: అరవింద వారధి వద్ద నక్కపాయకు గండి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..!

| Edited By: Balaraju Goud

Sep 01, 2024 | 7:01 PM

ప్రకాశం బ్యారేజ్ నుండి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భారీ వరద లంక గ్రామాలను తాకింది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండి పడింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్క పాయ వద్ద గండి పడటంతో భారీ వరద కొల్లూరు కరకట్ట వద్దకు చేరింది.

Andhra Pradesh: అరవింద వారధి వద్ద నక్కపాయకు గండి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..!
Nakkapaya Pond Damaged
Follow us on

ప్రకాశం బ్యారేజ్ నుండి ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో భారీ వరద లంక గ్రామాలను తాకింది. బాపట్ల జిల్లాలోని కొల్లూరు మండలంలోని పలు లంక గ్రామాలకు వెళ్లే మార్గానికి గండి పడింది. దీంతో తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నక్క పాయ వద్ద గండి పడటంతో భారీ వరద కొల్లూరు కరకట్ట వద్దకు చేరింది. దీంతో ప్రమాద అంచుకు చేరాయి.

గతంలో నక్క పాయకు పడిన గండికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని నివారించారు. అయితే వరద ఉధృతి పెరిగి రోడ్డు మార్గం మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీంతో పెసర్లంక, పెదలంక, సుగ్గుణ లంక, ఈపూరు లంక, కనిగిరి లంక, అన్నవరపు లంక, చింతల్లంక,కొత్తూరు లంక, గాజుల్లంక, పొతార్లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయయి. వందలాది ఎకరాలు నీట మునిగాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వీడియో చూడండి..

వరద ముంపు కారణంగా మంత్రులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, బాపట్ల కలెక్టర్ వెంకట మురళి పర్యటించి స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని సూచించారు. అయితే స్థానికులు మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొల్లూరు నుండి లంక గ్రామాలకు వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

2009లో పదిన్నర లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో లంక గ్రామాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ప్రస్తుతం ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ రాత్రికి మరింత నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అటు రెవిన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు స్థానిక సమాచారాన్ని జిల్లా అధికారులకు చేరవేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..