Gudivada: మైనర్ బాలుడు అదృశ్యం.. కట్ చేస్తే అతని ఎదిరింట్లో వివాహిత కూడా మిస్సింగ్.. మిస్టరీ ఏంటంటే..?

గుడివాడలో ఓ మైనర్ బాలుడు.. అతని ఇంటి ఎదురుగా ఉండే వివాహిత మిస్సింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Gudivada: మైనర్ బాలుడు అదృశ్యం.. కట్ చేస్తే అతని ఎదిరింట్లో వివాహిత కూడా మిస్సింగ్.. మిస్టరీ ఏంటంటే..?
Missing Case
Follow us

|

Updated on: Jul 25, 2022 | 5:23 PM

Andhra pradesh: అది ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ టౌన్. ఆ టౌన్‌లో గుడ్‌మెన్ పేట పేరుతో ఓ కాలనీ ఉంది. ఆ కాలనీలో ఓ 15 ఏళ్ల బాలుడి ఆచూకీ మిస్సయ్యింది. దీంతో పెరేంట్స్ చుట్టుపక్కల వెతికారు. ఫ్రెండ్స్ ఇళ్ల వద్ద ఉన్నడేమో అని ఎంక్వైరీ చేశారు. కానీ జాడ తెలియలేదు. ఈ క్రమంలోనే ఆ బాలుడి ఇంటి ఎదురుగా ఓ ఉండే ఓ వివాహిత(29) కూడా మిస్సైయ్యిందనే వార్త తెలిసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులకు టెన్షన్ మొదలైంది. ఆమె తమ బాలుడిని అపహరించిదని వారు ఫిక్సయ్యారు. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు. డబ్బుల కోసం బాలుడి అపహరణ జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత ఎదురింట్లోని బాలుడిని తీసుకెళ్లడంతో… స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి ఆచూకి పట్టి… కేసు చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తున్నారు. వివాహిత మాయమాటలతో బాలుడిని తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని టూ టౌన్ సీఐ దుర్గారావు మీడియాకు తెలిపారు. అంతేకాదు బాలుడి ఆచూకి చెప్పినవారికి తగిన పారితోషకం కూడా ఇస్తామని అతని పేరెంట్స్ తెలిపినట్లు చెప్పారు.  సో.. ప్రస్తుతానికి అయినే మిస్టరీ గోస్.. ఆన్.

Boy Missing

అదృశ్యం అయిన బాలుడు

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..