Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున ‘మోహిని’గా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మదనపల్లె జంట హత్యల కేసు పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Madanapalle murders: అలేఖ్య తన పేరును ఆ రోజున మోహినిగా మార్చుకుంది.. విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు

Updated on: Jan 28, 2021 | 3:52 PM

Madanapalle murders: ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన మదనపల్లె జంట హత్యల కేసు పోలీసుల విచారణంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలేఖ్య గతంలో పెట్టిన సోషల్ మీడియా పోస్టులు విస్మయానికి గురిచేస్తున్నాయి. పునర్జన్మలపై వారికున్న అపార నమ్మకమే హత్యలకు కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తులో గుర్తించిన వివరాల ప్రకారం… ఈ నెల 22న తన పేరును ‘మోహిని’గా మార్చుకుంటూ సామాజిక మాధ్యమాల్లో అలేఖ్య పోస్టులు పెట్టింది.

తాను ప్రపంచ సన్యాసిని అని ఆమె పేర్కొవడం గమనార్హం. తరచూ  ఆధ్యాత్మికవేత్త ‘ఓషో’ కొటేషన్లు ఆమె పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ‘ఓషో’ను తన ప్రేమికుడిగా ఆమె పోస్టులు చేసింది. చావు, పుట్టుకలకు సంబంధించి ఆమె పదే, పదే కొటేషన్లను పోస్టు చేసేది. జుట్టును కొప్పుగా చుట్టుకుని ‘హెయిర్ పిరమిడ్’గా వర్ణించింది. హెయిర్‌ పిరమిడ్‌ను అయస్కాంత శక్తిగా పేర్కొంది.
Also Read:
మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడి ఎంట్రీ.. అసలు కారణం ఆ మనిషే.?

శివ.. నాకు భయమేస్తుంది.. నన్ను మార్చండి.. నిందితురాలు పద్మజ జైల్లో తొలిరోజు ఎలా గడిపిందంటే..