AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…

నెల్లూరు జిల్లా ఇస్కపల్లి సముద్ర తీరానికి వెదురు బొంగులతో తయారు చేసిన పడవ కొట్టుకువచ్చింది. పడవ అనుమానాస్పదంగా ఉండటంతో.. స్ధానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు.

AP: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా...
Mysterious Boat
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2022 | 3:31 PM

Share

Suspected Boat: సముద్ర తీరానికి పడవలు కొట్టుకుని రావడం కామన్.  అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు లాక్‌లు తెగిపోయి చిన్న, చిన్న ఓడలు… పడవలు తీరాలకు కొట్టుకువస్తాయి. అయితే  నెల్లూరు జిల్లా(Nellore District)లో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవ మాత్రం.. మిస్టరీగా మారింది. ఆ పడవలో కనిపించినవి చూసి.. మత్సకారులకు కాస్త వింతగా అనిపించింది. అల్లూరు మండలం(Allur Mandal) ఇస్కపల్లి సముద్ర తీరానికి సదరు పడవ కట్టుకొచ్చింది.  వెదురు బొంగులతో ఆ పడవ నిర్మాణం చేశారు. పడవ కొత్తగా ఉండటంతో.. స్ధానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఈ పడవ లోపల బుద్దుడు విగ్రహం, శివలింగం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే  మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి.. వివరాలు చెప్పారు. మత్సకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఇది శ్రీలంకకు చెందిన పడవ అని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై.. పడవ  ఇలా తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్తరకం పడవను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకువచ్చిన దాఖలాలు ఉన్నాయని  స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెల్లడవ్వనున్నాయి.

Also Read:  AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. స్పష్టం చేసిన కేంద్రం

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి