Pawan Kalyan: మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు.. ఆ దెబ్బ నా మీద పడినట్టే.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan on srikalahasti incident: శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడి మీద పడిన దెబ్బ నా మీద పడినట్లే.. ఆమంచి స్వాములు మీద దెబ్బ పడినా నేను వెళతా.. జనసేనకు జన బలం ఉంది.. అన్ని జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాలను బలంగా ఎదుర్కొందాం..

Pawan Kalyan: మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు.. ఆ దెబ్బ నా మీద పడినట్టే.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
Pawan Kalyan

Updated on: Jul 15, 2023 | 7:26 PM

Pawan Kalyan on srikalahasti incident: శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడి మీద పడిన దెబ్బ నా మీద పడినట్లే.. ఆమంచి స్వాములు మీద దెబ్బ పడినా నేను వెళతా.. జనసేనకు జన బలం ఉంది.. అన్ని జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాలను బలంగా ఎదుర్కొందాం.. అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. శ్రీకాళహస్తిలో సీఐ అంజూయాదవ్ జనసేన నాయకుడిపై చెంప దెబ్బ కొట్టిన ఘటనపై స్పందించిన ఆయన.. తిరుపతి వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. శనివారం చీరాల నుంచి ఆమంచి స్వాములు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆమంచి స్వాములు చేరడం చాలా సంతోషం అంటూ పేర్కొన్నారు. నేను చీరాలలో పెరిగిన వాడినే అంటూ ఆ ప్రాంతంలో పేటల పేర్లను పవన్ కళ్యాణ్ చదివారు.

ఆమంచి శ్రీనివాసులను మనస్పూర్తిగా జనసేనలోకి ఆహ్వానిస్తున్నా.. కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడంటూ పవన్ పేర్కొన్నారు. కష్టం వస్తే నేను ఉన్నా అని నిలబడే వ్యక్తి స్వాములు రాక ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జనసేనకు బలమన్నారు. ఆమంచి కుమారుడు రాజేంద్ర కూడా తమ పార్టీలో చేరడం యువత మార్పునకు చిహ్నమన్నారు. అరాచక ప్రభుత్వం పోవాలి.. అవినీతి ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి.. జనం బాగుండాలంటే జగన్ పోవాలని పవన్ పేర్కొన్నారు.

కొంతమంది మాత్రమే కాదు అందరూ బాగుండాలని జనసేన సిద్దాంతం.. మన హక్కులను మనం సాధించుకుందాం.. ఒకరిని దేహీ దేహీ అని అడుక్కొవద్దంటూ వపన్ పేర్కొన్నారు. అందరం కలిసి రాష్ట్రం హితం కోసం పని చేద్దాు.. మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు.. ఎవడొస్తాడో ఇక నుంచి చూద్దాం.. శ్రీకాళహస్తి లో జనసేన నాయకుడి మీద పడిన దెబ్బ నా మీద పడినట్లే.. అన్ని జిల్లాల్లో వైసీపీ దౌర్జన్యాలను బలంగా ఎదుర్కొందామంటూ పవన్ క్యాడర్ కు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..