AP News: ఏపీలో వాలంటీర్ల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామాలు

ఏపీలో వాలంటీర్ల రాజీనామా కంటిన్యూ అవుతోంది. ప్రతిపక్ష కూటమి తమపై కక్ష కట్టడంతోనే... రిజైన్‌ చేస్తున్నామంటున్నారు వాలంటీర్లు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వందల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేయడం రాజకీయంగానూ రచ్చ లేపుతోంది. అధికార, ప్రతిపక్షాలు... తప్పు మీదంటే, మీదంటూ మాటలు యుద్ధానికి దిగుతున్నాయి. అసలు వాలంటీర్ల విషయంలో తప్పెవరిది...?

AP News: ఏపీలో వాలంటీర్ల సంచలన నిర్ణయం.. మూకుమ్మడి రాజీనామాలు
Ap Volunteers
Follow us

|

Updated on: Apr 01, 2024 | 7:47 PM

ఏపీలో ఈసీ ఆదేశాలు… వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలకు దారితీశాయి. ఎలక్షన్‌ విధులతో పాటు ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో… రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున రాజీనామా చేస్తున్నారు వాలంటీర్లు. విపక్ష నేతల వైఖరితో మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నంలో 823 మంది వాలంటీర్లుండగా… ఒక్కసారే 430 మంది రాజీనామా చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటు కర్నూలులోనూ 92 మంది వాలంటీర్లు తమ రాజీనామాను సమర్పించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 6 వందల మందికిపైగా వాలంటీర్లు రాజీనామా చేయడం పొలిటికల్‌ ఫైట్‌కు కారణమైంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వాలంటీర్ల విషయంలో తప్పు మీదంటే… మీదంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు.

వాలంటీర్‌ వ్యవస్థను చంద్రబాబే అడ్డుకున్నారని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లను ఆపి బడుగు-బలహీన వర్గాలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబుపై పేర్ని నాని సైతం ఫైరయ్యారు. కొంతమంది వ్యక్తులతో కలిసి చంద్రబాబే వాలంటీర్‌ వ్యవస్థను ఆపేశారని విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ నేతల మాటలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వాలంటీర్లను వాడుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు. వాలంటీర్ల విషయంలో టీడీపీని తప్పున పడేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు.

మొత్తంగా… వాలంటీర్ వ్యవస్థపై పొలిటికల్‌ ఫైట్‌ కంటిన్యూ అవుతోంది. లేటెస్ట్‌గా వాలంటీర్ల వరుస రాజీనామాలతో మరింత వేడెక్కింది ఏపీ రాజకీయం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త