అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..

| Edited By: Srikar T

Jul 04, 2024 | 12:55 PM

తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిండా 15 ఏళ్ళు కూడా నిండని ఆ బాలిక ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు మందలించడం పరిపాటే అయినా దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

అలా చేయోద్దని మందలించిన తల్లి.. మనస్థాపంతో ఆ అమ్మాయి ఏం చేసిందంటే..
Prakasham District
Follow us on

తల్లి మందలించిందన్న మనస్థాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిండా 15 ఏళ్ళు కూడా నిండని ఆ బాలిక ఓ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ బాలిక ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలతో బాలిక మృతి చెందడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు మందలించడం పరిపాటే అయినా దాన్ని ఇంత సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మైత్రి నగర్‎లో విషాదం చోటుచేసుకుంది. 15 సంవత్సరాల మైనర్ బాలిక రవణమ్మ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. రవణమ్మ ఓ యువకుడితో సన్నిహితంగా మాట్లాడుతుందన్న విషయాన్ని తెలుసుకున్న తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన రవణమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి కూలి పనికి బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారాన్ని అందుకున్న గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనస్థాపానికి గురైన బాలిక రవణమ్మ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబలో అంతులేని విషాదాన్ని నింపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…