Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు.. ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు

|

Feb 12, 2021 | 2:00 PM

Vizag Steel Plant: ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మే హక్కు ఎవరు ఇచ్చా..

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మే హక్కు ఎవరు ఇచ్చారు.. ఏపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు
Follow us on

Vizag Steel Plant: ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. రూ. 3 లక్షల విలువైన ప్రాజెక్టును తక్కువ ధరకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. పోస్కో ఎండీతో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సంప్రదింపులు బయటపెడతానని వ్యాఖ్యానించారు. పోస్కో, జగన్‌కు మధ్య విజయసాయిరెడ్డి బ్రోకరిజం నడుపుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌తో పోస్కో ప్రతినిధులు చర్చలు జరిపిన ఫోటోలు ఉన్నాయని, ఏ ఒప్పందాలు లేకుండానే సన్మానాలు చేశారా.? అంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. దోచుకునేందుకు విశాఖలో అన్న, తెలంగాణలో చెల్లి సిద్దమయ్యారని ఆరోపణలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామన్నారు.

న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు.. ఆధారాలన్నింటినీ సీబీఐకి చూపుతా: ఆమంచి కృష్ణమోహన్