Vijayawada Floods: వరద ముంపులోనే విజయవాడ.. గజగజ వణికిస్తున్న మరో గండం..!

భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్నా కొద్దీ... చనిపోయివారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 22 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వస్పత్రికి తరలించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి దగ్గర విషాదచాయలు అలుముకున్నాయి.

Vijayawada Floods: వరద ముంపులోనే విజయవాడ.. గజగజ వణికిస్తున్న మరో గండం..!
Vijayawada Floods

Updated on: Sep 04, 2024 | 7:45 PM

నాలుగు రోజులు గడిచిపోయింది. ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ. బుడమేరు, కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్ని నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గినా సింగ్‌నగర్‌ ముంపులోనే ఉంది. సింగ్‌నగర్‌లో ఎటు చూసినా మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే.. మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్నా కొద్దీ… చనిపోయివారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 22 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వస్పత్రికి తరలించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి దగ్గర విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. విజయవాడలో వరద బాధితుల కోసం గత మూడు రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు,హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేపడుతున్నాయి. వరద ప్రభావిత...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి