AP News: తిరుపతి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం..

సోమవారం తెల్లవారుజామున.. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు.

AP News: తిరుపతి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం..
Road Accident

Updated on: Aug 08, 2022 | 7:13 AM

AP Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలో జరిగింది. సోమవారం తెల్లవారుజామున.. లారీని ఓ కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. పల్నాడు జిల్లాలోని మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. మృతులు అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55), ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us