Andhra Pradesh: జుట్టూజుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్న మహిళలు.. ఇంతకీ వారు ఎందుకు కొట్టుకున్నారంటే..
బాపట్ల జిల్లాలో మహిళల మధ్య మల్లయుద్ధం జరిగింది. జుట్టూజుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. ఇంతకీ, వాళ్లెందుకు కొట్టుకున్నారు? కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
బాపట్ల జిల్లాలో మహిళల మధ్య మల్లయుద్ధం జరిగింది. జుట్టూజుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్నారు. ఇంతకీ, వాళ్లెందుకు కొట్టుకున్నారు? కారణమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.. సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో మహిళలు రెచ్చిపోయారు. జుట్టూజుట్టు పట్టుకొని చితక్కొట్టుకున్నారు. దొమ్మికీ దిగినట్టుగా అటువైపో గ్రూపు, ఇటువైపో గ్రూపు జుట్లతో కుస్తీకి దిగారు. జుట్టులు ఊడి వచ్చేశాయా అన్నంతగా స్ట్రీట్ ఫైట్కి దిగారు ఆడోళ్లు. కొప్పరం గ్రామం నెహ్రూనగర్లో ఈ జుట్టుల యుద్ధం జరిగింది. వాలంటీర్పై కొందరు మహిళలు.. అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ గొడవ చెలరేగింది.
వాలంటర్పై కంప్లైంట్ చేసిన మహిళలపై దాడి చేశారు. వాలంటీర్ కుటుంబ సభ్యులు, మహిళలు.. కంప్లైంట్ చేసిన వాళ్లతో గొడవకు దిగారు. మాటామాటా పెరిగి, ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది పరిస్థితి. ఇరువర్గాలూ జుట్టూజుట్టు పట్టుకొని కొట్టుకోవడంతో రణరంగాన్ని తలపించింది. చుట్టూ జనం ఉన్నా, వాళ్లంతా ప్రేక్షక పాత్రే పోషించారు. సినిమా చూస్తున్నట్లు వాళ్ల కొట్లాటను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఎవరూ కూడా విడిపించి సర్దిచెప్పే ప్రయత్నం చేయకపోవడంతో గంటల తరబడి సీన్ నడిచింది. రెండువైపులున్న మహిళలు.. జుట్టులు ఊడొచ్చేలా కొట్టుకున్నారు.
ఈ ఇన్సిడెంట్ కొప్పరం గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. వాలంటీర్పై కంప్లైంట్ చేస్తే దాడికి దిగడంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. దాడి చేసిన వాలంటీర్ కుటుంబ సభ్యులపై కంప్లైంట్ చేశారు. దాంతో, దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..