AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టోల్‌ప్లాజాల వద్ద కరోనా తెచ్చిన మార్పు

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో వాహనాల జోరు పెరిగింది. హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక ఔటర్‌ రింగురోడ్డులోనూ వెహికిల్స్‌ దూసుకుపోతున్నాయి. అయితే ఓఆర్‌ఆర్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ వినియోగం బాగా పెరిగింది. డబ్బులిచ్చి రసీదు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో.. చాలా మంది ఫాస్టాగ్‌నే వినియోగిస్తున్నారు. టోల్‌ప్లాజాల దగ్గర గతంతో పోల్చితే 40 శాతం ఫాస్టాగ్‌ కార్డుల వినియోగం పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మనీ చెలామణి తగ్గి క్యాష్‌లెస్‌ పేమెంట్‌కే వాహనదారులు […]

టోల్‌ప్లాజాల వద్ద కరోనా తెచ్చిన మార్పు
Sanjay Kasula
|

Updated on: Jun 03, 2020 | 5:48 PM

Share

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో వాహనాల జోరు పెరిగింది. హైదరాబాద్‌లో పెద్దసంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇక ఔటర్‌ రింగురోడ్డులోనూ వెహికిల్స్‌ దూసుకుపోతున్నాయి. అయితే ఓఆర్‌ఆర్‌పై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్‌ వినియోగం బాగా పెరిగింది. డబ్బులిచ్చి రసీదు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో.. చాలా మంది ఫాస్టాగ్‌నే వినియోగిస్తున్నారు.

టోల్‌ప్లాజాల దగ్గర గతంతో పోల్చితే 40 శాతం ఫాస్టాగ్‌ కార్డుల వినియోగం పెరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మనీ చెలామణి తగ్గి క్యాష్‌లెస్‌ పేమెంట్‌కే వాహనదారులు మొగ్గుచూపుతున్నారు. ఫాస్టాగ్‌ వల్ల మనీ కూడా సేవ్‌ అవుతుందని ఓఆర్‌ఆర్‌ సిబ్బంది చెబుతున్నారు. ఫాస్ట్‌టాగ్‌ వాడడం వల్ల రిటర్న్‌ జర్నీకి మనీ తక్కువ పడుతుందని అంటున్నారు.