AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం

Crore Talambralu: తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురంలో రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాల మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు తదితర వానరసేన వేషధారణలో భక్తులు రామనామ స్మరణతో వరి విత్తనాలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు పంపే తలంబ్రాల కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.

వానరసేన వేషధారణలో కోటి తలంబ్రాల మహాయజ్ఞం.. రామనామంతో వరి విత్తనాల సాగుకు శ్రీకారం
Crore Talambralu Maha Yagnam
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 6:06 PM

Share

రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు మహా యజ్ఞానికి వానర సేన వేషధారణతో వరి పంటకు శ్రీకారం చుట్టారు. భద్రాచలంలోని సీతారాముల సన్నిధిలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు చేసి గోటి కోటి తలంబ్రాలు పంట కోసం దివి నుంచి భూమికి దిగివచ్చినట్లుగా, శ్రీరాముడు, జాంబవంతుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణతో దుక్కి దున్ని.. విత్తనాలను రామనామ స్మరణతో జల్లారు. వానర వేషధారణతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని తిలకించారు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా భక్తిశ్రద్ధలతో కోటి తలంబ్రాలకు ఏర్పాటుకు మహా యజ్ఞాన్ని చేపడతారు. దానిలో భాగంగా 16వసారి అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాలకు గోటి కోటి తలంబ్రాలు పంపిస్తారు. గోటి కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి భక్తులు ప్రతి ఏట మాదిరిగానే వానర సేన వేషధారణతో అందరినీ అలరిస్తూ దుక్కి దున్ని వరి పంటను పండించేందుకు శ్రీకారం చుట్టారు. అచ్చుతాపురం గ్రామంలో ప్రతి ఏట కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి సాగు చేసే శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణం అప్పారావు.. తన సొంత పొలంలో ఎకరం 60 సెంట్లలో శ్రీరాముడు తత్వాన్ని ప్రతి ఒక్కరికి చేరాలని సంకల్పంతో శ్రీరాముడి ప్రతిమకు ప్రత్యేక పూజలు చేసి రాములోరి నామంతో వరి నాట్లకు దుక్కి దున్నే ఆకుమడిగు సిద్ధం చేశారు. వరి విత్తనాలను కోటి తలంబ్రాల కలశాలతో ప్రత్యేక పూజలు అనంతరం భద్రాచలం, అయోధ్య, ఒంటిమిట్టకు కోటి తలంబ్రాలకు ఈ వరి విత్తనాలను సాగు చేసి పంపించే కార్యక్రమానికి ప్రతి ఏటా వేషధారణలతో ఇలా చేయడం చాలా సంతోషకరంగా ఉందంటూ రామ భక్తులు తెలిపారు.

వీడియో చూడండి..

Follow Us