ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ. జనసేన పార్టీ స్పీడ్ పెంచింది. టీడీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు జనసేన పార్టీలోకి చేరారు. ఇదివరకే ఈయన జనసేనలోకి చేరతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్.. దేవినేని మల్లికార్జునరావును జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేపల్లె నుంచి జనసేన అభ్యర్థిగా మల్లికార్జునరావు బరిలోకి దిగనున్నారట.