AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకాలు: మంత్రి అవంతి

Andhrapradesh:  నిర్వహించారు. క్రీడాకారులను ప్రాత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం సచివాలయంలో..

Andhrapradesh: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకాలు: మంత్రి అవంతి
Subhash Goud
|

Updated on: Feb 16, 2022 | 1:56 PM

Share

Andhrapradesh:  క్రీడాకారులను ప్రాత్సహించేందుకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం సచివాలయంలో మంత్రి క్రీడల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 13 జిల్లాల్లోనూ సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. మార్చి 31వ తేదీలోపు మిగిలిన జిల్లాల్లో సీఎం కప్ టోర్నమెంట్ పూర్తి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ప్లే ప్లేగ్రౌండ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే గ్రామీణ అభివృద్ది శాఖ ద్వారా ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ప్లే గ్రౌండ్లను అభివృద్ది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 185 కోట్లతో క్రీడా ప్రాంగణాలు అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. 6 గురుకుల పాఠశాలల్లో క్రీడా విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మిగిలిన గురుకులాల్లో క్రీడా విభాగాలు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 13 క్రీడా ప్రాంగణాలనును పీపీపీ మోడ్‌లో అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పంపినట్లు చెప్పారు. సీఎం ఆమోదం అనంతరం అభివృద్ది పనులు చేపడతామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Srisailam: ఆ ఎమ్మెల్యే అండతోనే రజాక్ రెచ్చిపోతున్నాడు.. బీజేపీ నేతల తీవ్ర ఆరోపణలు..

Bjp vs Trs: మోడీని తరిమేస్తారా.. బికేర్ ఫుల్.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేత సీరియస్ వార్నింగ్!

AP News: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సలహాదారునిగా జయప్రకాశ్‌సాయి.. అభినందించిన మంత్రి పెద్దిరెడ్డి