చిత్తూరు మొగలిఘాట్‌ రోడ్‌లో మరో ఘోరం.. రెండు లారీలు దగ్ధం..

|

Sep 26, 2024 | 10:51 AM

అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్‌ సజీవ దహనం అయ్యాడు. షుగర్‌ లోడ్‌ లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ ఇరుక్కుపోయారు. అక్కడికక్కడే క్లీనర్‌ మరణించాడు. స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు,

చిత్తూరు మొగలిఘాట్‌ రోడ్‌లో మరో ఘోరం.. రెండు లారీలు దగ్ధం..
Road Accident
Follow us on

చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారు పాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్‌లో అర్థరాత్రి 2గంటల ప్రాంతంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఘాట్ రోడ్డులో ఆగి ఉన్న లారీని, మరో లారీ ఢీకొట్టింది. నేరుగా లారీ డీజిల్ ట్యాంక్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కట్టెల లారీ పూర్తిగా దగ్దమైంది. లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అదే టైంలో.. ఢీ కొట్టిన లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి క్లీనర్‌ మృతి చెందగా, డ్రైవర్‌ గాయపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. చిత్తూరు వి.కోట నుంచి తెలంగాణ భద్రాచలం వెళ్లాల్సిన కట్టెల లోడ్ లారీ మొగిలి ఘాట్‌ వద్ద ఇంజన్ సమస్యతో డ్రైవర్‌ పక్కన నిలిపి రిపేర్‌ చేస్తున్నాడు. అదే సమయంలో హుబ్లీ నుంచి చిత్తూరు వైపు వస్తున్న షుగర్ లోడ్ తో నిండివున్న లారీ వెనుక నుంచి అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది.

అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కలప లారీలో మంటలు చెలరేగి డ్రైవర్‌ సజీవ దహనం అయ్యాడు. షుగర్‌ లోడ్‌ లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌, క్లీనర్‌ ఇరుక్కుపోయారు. అక్కడికక్కడే క్లీనర్‌ మరణించాడు. స్థానికులు డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన క్లీనర్‌తో పాటు, మరో లారీ డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..