TTD: అద్దె గదుల ధరల పెంపునకు పొలిటికల్ టచ్.. ఆదాయం వస్తున్నా ధరలు పెంచడమేంటని ఫైర్..

తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై యుద్ధం నడుస్తోంది. టీటీడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది బీజేపీ. అయితే, సామాన్యుల గదులను టచ్‌ చేయలేదంటోంది టీటీడీ. మరి,...

TTD: అద్దె గదుల ధరల పెంపునకు పొలిటికల్ టచ్.. ఆదాయం వస్తున్నా ధరలు పెంచడమేంటని ఫైర్..
Somu Veerraju

Updated on: Jan 13, 2023 | 6:11 AM

తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై యుద్ధం నడుస్తోంది. టీటీడీ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది బీజేపీ. అయితే, సామాన్యుల గదులను టచ్‌ చేయలేదంటోంది టీటీడీ. మరి, ధరలు పెంచిన గదులేంటి?. టీటీడీ ఏం క్లారిఫికేషన్‌ ఇచ్చింది?. తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై భగ్గుమన్నారు బీజేపీ నేతలు. పెంచిన ధరలు తగ్గించాల్సిందే, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బు ఏమైనా తక్కువైందా? ఏ ఆలయానికి లేనంత ఆదాయం టీటీడీకి వస్తుంటే, అద్దె గదుల ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.

అద్దె గదుల ధరల పెంపును సమర్ధించుకుంది టీటీడీ. ఆధునీకరించాం-అందుకే పెంచామంటూ క్లారిటీ ఇచ్చారు టీటీడీ ఈవో. అయితే, సామాన్యుల గదుల ధరలను టచ్‌ చేయలేదని చెప్పారు. తిరుమలలో పెంచిన అద్దె గదుల ధరలను తగ్గించాల్సిందే అంటున్నారు బీజేపీ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధ్యక్షు[g చంద్రబాబు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చేయాలి అనుకుంటున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అసలు పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారని ఫైర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us