AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సర్కారు ఆఫీసులకే షాకిచ్చిన విద్యుత్ శాఖ.. ఎంత మొత్తుకున్న వినని అధికారులు.. అసలేమైందంటే..

Ongole Circle: చిర్రెత్తుకొచ్చిన విద్యుత్‌ శాఖ అధికారులు తమ పవర్‌ కట్‌ టూల్స్‌తో రంగంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా 392 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయి. అత్యధికంగా RWS ఆఫీస్.. 112 కోట్లు..

Andhra Pradesh: సర్కారు ఆఫీసులకే షాకిచ్చిన విద్యుత్ శాఖ.. ఎంత మొత్తుకున్న వినని అధికారులు.. అసలేమైందంటే..
Power Cut
Sanjay Kasula
| Edited By: |

Updated on: Aug 06, 2022 | 3:04 PM

Share

కరెంట్ బిల్లులు (Power Bills)వెంటనే కట్టండీ లేకుంటే సరఫరా కట్ చేస్తాం. బిల్లు చెల్లించకపోతే కరెంట్‌ను నిలిపి వేస్తామని వినియోగదారులను హెచ్చరించారు. అయితే తామ హెచ్చరికలు సామాన్యుడికైనా.. అధికారికైనా ఒకే సూత్రాన్ని పాటిస్తున్నారు. అంతే కాదు ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి కరెంట్ నిలిపివేశారు. కట్టండి ప్లీజ్..!అంటూ అధికారులతో ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా వినిపించుకున్న పాపాన పోలేదు. దీంతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ ఉద్యోగులు.. ఆ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కట్ చేశారు. వారు కట్టాల్సింది.. వందలు, వేలు, లక్షలు కాదు.. చెల్లించాల్సి విద్యుత్ బిల్లులు కోట్లలో ఉండటంతో ఇలా చర్యలు తీసుకున్నారు.

ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ శాఖ అధికారులు(APCPDCL) షాక్‌ ఇచ్చారు. నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేశారు. ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 10వ తేదీ లోపు విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే.. సర్‌చార్జి మినహాయిస్తామని నెలరోజుల నుంచి నోటీసులు జారీ చేసి మరీ చెబుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన విద్యుత్‌ శాఖ అధికారులు తమ పవర్‌ కట్‌ టూల్స్‌తో రంగంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా 392 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయి. అత్యధికంగా RWS ఆఫీస్.. 112 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ 90 కోట్లు, ఇరిగేషన్‌ శాఖ 100 కోట్లు, మున్సిపాలిటీలు 13 కోట్లు, విద్యాశాఖ 7 కోట్లు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ చెప్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..