Kalyanamasthu Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనున్న సర్కార్

ఇచ్చిన హామీల్లో 98శాతం అమలు చేసిన జగన్‌ సర్కార్‌...పేదప్రజలకు మరో తీపి కబురు అందించింది. మరో భారీ సంక్షేమ పథకానికి కసరత్తులు పూర్తి చేసింది. మరో కీలక హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 1 నుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది.

Kalyanamasthu Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనున్న సర్కార్
Ap Marriage Assistance Sche

Updated on: Sep 11, 2022 | 10:50 AM

Kalyanamasthu Scheme: సంక్షేమ పథకాల్లో ఎప్పుడూ ముందుండే ఏపీ ప్రభుత్వం మరో కీలక పథకంతో ముందుకొచ్చింది. YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది.ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు బాసటగా ఉండేందుకు, గౌరవప్రదంగా వివాహం జరిపించేందుకు తోడ్పాటుగా ఈ పథకాన్ని జగన్‌ సర్కార్‌ అమలు చేయనుంది.

పేద ప్రజలు, అణగారిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం YSR కళ్యాణమస్తు పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎస్సీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు కానుకగా ఇవ్వనున్నారు. అదే ఎస్టీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద లక్ష రూపాయలు, ఎస్టీల కులాంతర వివాహాలకు కూడా లక్ష 20 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక బీసీలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు కింద 50వేలు, బీసీలో కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు. మైనారిటీలకు షాదీ తోఫా కింద లక్ష రూపాయలు, దివ్యాంగులు వివాహాలకు లక్షన్నర, భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు 40 వేల రూపాయలు ఇవ్వాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది.

YSR కళ్యాణమస్తు పథకకానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని స్పష్టం చేసింది. అన్ని అర్హతలను జీవోలో పొందుపరిచిన ఏపీ ప్రభుత్వం.. పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి తేనుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే ఈ పథకం నిర్వహణ చేపబడుతోంది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరోవైపు అటు ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రెండు నెలలు వెయిట్‌ చేస్తే.. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని అభయమిచ్చారు.

కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది జగన్‌ సర్కార్‌. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసినట్లు అవుతుందని వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..